పిఠాపురం మున్సిపాలిటీ మాజీ వైస్ చైర్మన్, శ్రీ కృష్ణ యాదవ సంఘం పిఠాపురం నియోజకవర్గం అధ్యక్షులు శ్రీ జోగా వీర వెంకట రమణ యాదవ్, యువజన విభాగం అధ్యక్షులు శ్రీ సారిమల్లి రమేష్ యాదవ్ జనసేన పార్టీలో చేరారు. పిఠాపురంలో శుక్రవారం జనసేన పార్టీ ప్రధాన శ్రీ కె. నాగబాబు గారు కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. జనసేన ఎన్.అర్.ఐ. విభాగం ఆస్ట్రేలియా కన్వీనర్ శ్రీ కొలికొండ శశిధర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో శ్రీ పిండి శ్రీనివాసరావు, శ్రీ కోన శివ, శ్రీ పాలకొల్లు శంకర్ పాల్గొన్నారు.