నేను ఏరోజు ఏ నాయకుడిని వెళ్ళిపొమ్మని చెప్పలేదు, కొంతమంది నాయకులు వెళ్లిపోవచ్చు, కానీ ఎవరూ వచ్చినా వెళ్ళినా జనసేన పార్టీ ఉంటుంది, నా జనసైనికులు ఉంటారు. జనసైనికులు రాష్ట్ర క్షేమం కోసం , ప్రజా క్షేమం కోసం నిలబడే వారు. నా సినిమాలు ఆపేసినప్పుడు చెప్పాను మనల్ని ఎవడ్రా ఆపేది అని, మళ్ళీ ఇప్పుడు చెప్తున్నాను, కూటమి ప్రభుత్వం రాకుండా మనల్ని ఎవడ్రా ఆపేది అని పవన్ కళ్యాణ్ గారు అమలాపురం సభలో వ్యాఖ్యానించారు