మెగా అభిమానుల ఆత్మీయ సమావేశంలో శ్రీ కె. నాగబాబు గారు ఎవరెస్ట్ శిఖరం లాంటి అన్నయ్య శ్రీ చిరంజీవి గారు జనసేన పార్టీకి 5 కోట్ల రూపాయల ప్రోత్సాహం అందించడం చాలా సంతోషకరమైన అంశమని, ఇంతవరకు శ్రీ చిరంజీవి గారి మద్దతు జనసేనకు లేదనే వాళ్ళ నోర్లు ఇప్పుడు మూత పడ్డాయని, శ్రీ చిరంజీవి గారి ఆశీస్సులు జనసేనకు ఎల్లప్పుడూ ఉంటాయని జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీ కె. నాగబాబు గారు స్పష్టం చేశారు. అఖిల భారత చిరంజీవి యువత వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీ రవణం స్వామి నాయుడు, జిల్లా అధ్యక్షులు శ్రీ మేడిశెట్టి సూర్యకిరణ్ (కత్తిపూడి బాబీ) ఆధ్వర్యంలో ఆదివారం పిఠాపురంలో జరిగిన మెగా అభిమానుల ఆత్మీయ సమావేశంలో శ్రీ కె. నాగబాబు గారు ముఖ్య అతిథిగా, రాష్ట్ర అధ్యక్షులు పీ. భవానీ కుమార్, జనసేన స్టార్ కాంపైనర్ శ్రీ సాగర్ (అర్. కే. నాయుడు), ఉపాధ్యక్షులు శ్రీ ఏడిద శ్రీనివాస్ అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా శ్రీ నాగబాబు గారు మాట్లాడుతూ.. మెగా అభిమానులు చిరంజీవి బ్లడ్ బ్యాంక్, ఐ బ్యాంక్, ఇతర సేవా కార్యక్రమాల ద్వారా ఎప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉంటారని, రాజకీయ కార్యక్రమాల పట్ల కూడా చురుకైన పాత్ర పోషించాల్సిన సమయం ఇప్పుడు ఆసన్నమైందని చెప్పారు. సార్వత్రిక ఎన్నికల్లో మెగా అభిమానులు అంతా జనసేన, తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ కూటమి అభ్యర్థుల గెలుపు కోసం శ్రమించాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో వైసీపీ రాక్షస పాలన అంతం కావాలంటే అన్ని శక్తులు ఏకం కావాల్సిన అవసరం ఉన్నదన్నారు. శ్రీ చిరంజీవి గారి మద్దతు ద్వారా జనసేనకు బలం రెటింపైందని తద్వారా మెగా అభిమానులు అందరికీ బాధ్యత పెరిగిందని పునరుదాటించారు.